14, ఆగస్టు 2012, మంగళవారం

తెలుగు భాగవతము

     బమ్మెర పోతనామాత్యుల వారు తెలుగు వారందరికీ ఆరాధ్యనీయులు, ప్రాతస్మరణీయులు, మహా కవి, సహజ కవి, ప్రజా కవి. ఆంధ్ర భాష ఉన్నంత వరకు, ఆంధ్రులు ఉన్నంత వరకు ఉండేవి వీరి కృతులు.

    వ్యాస మూలం నుండి ప్రాంతీయ భాషలలోకి వచ్చిన శ్రీ మద్భాగవతాలలో వీరి తెలుగు సేత భాగవతము ప్రప్రథమ మైనది, అత్యుత్తమ మైనది. ఇదే కాక భోగినీ దండకం, వీరభద్ర విజయం కూడా వీరి కృతులే. 

     పోతన గారి పలుకులు, వాటికి  చెందిన వాటిని క్రమం తప్పకుండా స్మరించి తరించాలని ఇది మొద లెట్టాను. సహృదయులు, భాగవత ప్రియులు, భాషాభిమానులు ఆదరించి ప్రోత్సహించండి.
 ----------------------------------------------------------------------------------------------
   శ్రీ రాముడు కనిపించి ఆజ్ఞాపించాడట. శ్రీ కైవల్య పదంబుఁ జేరుటకునై అంటు మొదలెట్టాడు భాగవత ఆంద్రీకరణ. శ్రీకృష్ణుని స్మరిస్తూ కైవల్య పదం (మోక్షం) కావాలని కోరుకున్నాడు. లోకాన్ని కాపాడేవాడు, భక్తులను చల్లగా చూసేవాడు, తమో గుణ మనే రాక్షసాన్ని అణచేవాడు, బ్రహ్మాండ భండాలని లీలగా ఆడించే వాడు ఐన యశోద కృష్ణుడిని వేడుకొన్నాడు.
    ఈ పద్యం టికా, టిప్పణి చూడటానికి, వినడానికి కింద లింకుపై క్లిక్ చేయండి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి